Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మధ్యలోనే ఉండాలన్న నిబంధన లేదు.. ఢిల్లీ కూడా ఓ పక్కన ఉంది : టి.సుబ్బరామిరెడ్డి

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (12:51 IST)
వైజాగ్‌ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. అదేసమయంలో విశాఖపట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. 
 
రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, జీఎన్‌ రావు కమిటీ  ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. 
 
ఏపీకి విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉండాలనే నిబంధన లేదని సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ కూడా ఓ పక్కకు ఉన్నాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కు కావాల్సిన అన్ని వసతులు విశాఖకు ఉన్నాయని, విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
 
తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖే పెద్ద నగరమని తెలిపారు. అయితే, అమరావతిలో రాజధాని కోసం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని సుబ్బరామిరెడ్డి కోరారు. తాను తన వ్యక్తిగత అభిప్రాయాలను చెబుతున్నాని స్పష్టం చేశారు.
 
అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఉండాలని, బెంచ్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని కమిటీ నివేదిక సమర్పించినట్లు మీడియాలో చూసి తెలుసుకున్నానని సుబ్చరామిరెడ్డి చెప్పారు. విశాఖ పారిశ్రామికవేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments