Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగచాటు పడకసుఖం ఇవ్వాల్సిందేనంటూ మహిళకు నిప్పు

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (12:44 IST)
తనతో కుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగంచాలంటూ ఓ మహిళను ఓ వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో ఆ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా తండూరుకు చెందిన అంజిలమ్మ (40) అనే మహిళతో అగ్గనూరు గ్రామానికి చెందిన నర్సింహులు (45) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, కొన్ని రోజులుగా అంజిలమ్మ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆగ్రహించిన నర్సింహులు.. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. 
 
ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి 11 గంటలకు ఆమెపై కిరోసిస్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. అనంతరం నర్సింహులు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. వారివద్దరికీ తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఈ రోజు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజిలమ్మ కుటుంబ సభ్యులపై కూడా నర్సింహులు కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments