Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు పిలిచి లాఠీలు విరిగేలా కొట్టిన ఎస్సైలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:53 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. అదీ కూడా తమ చేతిలోని లాఠీలు విరిగిపోయేరా కొట్టారు. తాను కూడా పోలీస్ కానిస్టేబుల్ ముర్రో అని మొత్తుకుంటున్నా ఎస్సైలు ఏమాత్రం పట్టించుకోకుండా చావబాదారు. ఇది ఇపుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాళహస్తి రూరల్ పోలీసుస్టేషన్‌‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ సోమవారం అర్థరాత్రి సమయంలో తన స్నేహితులతో కలసి ఓ దాబాలో కూర్చొని ఉన్నాడు. అతన్ని ట్రైనీ ఎస్.ఐ ఒకరు గుర్తించి.. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. 
 
తను కూడా పోలీసుశాఖలోనే పనిచేస్తున్నానని అనిల్‌కుమార్‌ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ విషయాన్ని ఎస్ఐ మరో ఇద్దరు ఎస్.ఐల దృష్టికి తీసుకెళ్లాడు. అనిల్‌కుమార్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించుకున్న ఎస్సైలు అతన్ని లాఠీలతో శరీర భాగాలు కుమిలిపోయేలా చితకబాదారు. 
 
ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఈ విషయం పోలీస్‌ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో... ఎస్పీ అన్బురాజన్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఎస్.ఐల దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments