Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు పిలిచి లాఠీలు విరిగేలా కొట్టిన ఎస్సైలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:53 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. అదీ కూడా తమ చేతిలోని లాఠీలు విరిగిపోయేరా కొట్టారు. తాను కూడా పోలీస్ కానిస్టేబుల్ ముర్రో అని మొత్తుకుంటున్నా ఎస్సైలు ఏమాత్రం పట్టించుకోకుండా చావబాదారు. ఇది ఇపుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాళహస్తి రూరల్ పోలీసుస్టేషన్‌‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ సోమవారం అర్థరాత్రి సమయంలో తన స్నేహితులతో కలసి ఓ దాబాలో కూర్చొని ఉన్నాడు. అతన్ని ట్రైనీ ఎస్.ఐ ఒకరు గుర్తించి.. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. 
 
తను కూడా పోలీసుశాఖలోనే పనిచేస్తున్నానని అనిల్‌కుమార్‌ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ విషయాన్ని ఎస్ఐ మరో ఇద్దరు ఎస్.ఐల దృష్టికి తీసుకెళ్లాడు. అనిల్‌కుమార్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించుకున్న ఎస్సైలు అతన్ని లాఠీలతో శరీర భాగాలు కుమిలిపోయేలా చితకబాదారు. 
 
ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఈ విషయం పోలీస్‌ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో... ఎస్పీ అన్బురాజన్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఎస్.ఐల దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments