Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్ నాది.. తెల్ల కాగితాలపై బాబు సంతకాలు చేయించుకుని?: మోహన్ బాబు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (18:20 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తనతో పాటు దాగా అనే మరో మిత్రుడు, చంద్రబాబు కలిసి హెరిటేజ్‌ని స్థాపించామని.. కానీ అధిక పెట్టుబడి తానే పెట్టానని.. మిగిలిన ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని తన వాటాను కొట్టేశారని మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇంకా తన వద్ద నుంచి బ్లాంక్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారన్నారు. ఆ సమయంలో హీరోగా టాప్ పొజిషన్‌లో ఉన్న తాను, చాలా బిజీగా ఉన్నానని, స్నేహితుడే కదా అని చంద్రబాబును నమ్మి సంతకాలు చేశానని వెల్లడించారు. 
 
కొన్నేళ్ల తర్వాతే తనకు హెరిటేజ్‌ సంస్థతో సంబంధం లేదనే విషయం తెలిసిందన్నారు.  ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. తనను మోసం చేసి హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ... ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు నిలదీశారు. 
 
పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని మోహన్ బాబు చెప్పారు. తాను బయటకు వచ్చిన తరువాత దాగాను కూడా మోసం చేసి తరిమేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments