Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్ నాది.. తెల్ల కాగితాలపై బాబు సంతకాలు చేయించుకుని?: మోహన్ బాబు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (18:20 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తనతో పాటు దాగా అనే మరో మిత్రుడు, చంద్రబాబు కలిసి హెరిటేజ్‌ని స్థాపించామని.. కానీ అధిక పెట్టుబడి తానే పెట్టానని.. మిగిలిన ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని తన వాటాను కొట్టేశారని మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇంకా తన వద్ద నుంచి బ్లాంక్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారన్నారు. ఆ సమయంలో హీరోగా టాప్ పొజిషన్‌లో ఉన్న తాను, చాలా బిజీగా ఉన్నానని, స్నేహితుడే కదా అని చంద్రబాబును నమ్మి సంతకాలు చేశానని వెల్లడించారు. 
 
కొన్నేళ్ల తర్వాతే తనకు హెరిటేజ్‌ సంస్థతో సంబంధం లేదనే విషయం తెలిసిందన్నారు.  ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. తనను మోసం చేసి హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ... ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు నిలదీశారు. 
 
పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని మోహన్ బాబు చెప్పారు. తాను బయటకు వచ్చిన తరువాత దాగాను కూడా మోసం చేసి తరిమేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments