Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపం... చీపుర్లతో కొట్టించుకున్న సంగతి మోహన్ బాబు మరిచిపోయారు...

పాపం... చీపుర్లతో కొట్టించుకున్న సంగతి మోహన్ బాబు మరిచిపోయారు...
, మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:23 IST)
ఇటీవల వైకాపాలో చేరిన సినీ నటుడు మోహన్ బాబుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఘాటు విమర్శలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని మోహన్ బాబు విమర్శలు చేయడం సిగ్గుగా ఉందన్నారు. మోహన్ బాబు ఇపుడు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారని, లక్ష్మీపార్వతి అయితే ఆయన గురించి సరిగ్గా చెబుతారన్నారు. 
 
పాతికేళ్ల కిత్రం నిమ్స్‌ ఆస్పత్రి సిబ్బందితో మోహన్ బాబు అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుర్లతో తరిమికొట్టిన విషయం మోహన్ బాబు మరిచిపోయినట్టుగా ఉన్నారన్నారు. మోహన్ బాబు గతంలో ఓ ఎయిర్ హోస్టెస్‌తోనూ అసభ్యంగా ప్రవర్తించారని అనురాధ ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన కొడుకు లవ్ స్టోరీని ఓ టీవీ చానల్ ప్రసారం చేస్తే తుపాకీతో బెదిరించింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల తన విద్యా సంస్థల్లో పని చేస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు నడిరోడ్డుపై పడుకుని ధర్నా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబుపై వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేయ్.. ఆ రెండూ కోసేస్తా.. మరోసారి బూతు పురాణం మొదలెట్టిన జెసీ