Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (17:16 IST)
కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌ ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శైలజానాథ్‌ను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా మస్తాన్‌ వలీ, తులసిరెడ్డిలను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది.

ఇంతకాలం ఏపీ పీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలంతా వీడినా.. రఘువీరా మాత్రం హస్తం పార్టీలోనే కొనసాగారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేదు.
 
ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తులసిరెడ్డి నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. గతంలో 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన తులసిరెడ్డి .. ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలతో తులసి రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన బీజేపీ, టీడీపీలో కూడా కీలక పదవులు అనుభవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments