Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముద్దుల ర్యాలీలకు తెరలేపిన శ్రీ జగన్‌గారు : బుద్ధా వెంకన్న

ముద్దుల ర్యాలీలకు తెరలేపిన శ్రీ జగన్‌గారు : బుద్ధా వెంకన్న
, గురువారం, 16 జనవరి 2020 (12:07 IST)
తన తండ్రి హయాంలో సంపాదించిన సొమ్మునంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే, ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులు అటాచ్ చేశారనీ, అలా పోయిన డబ్బునంతా తిరిగి రాబట్టుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఎత్తుగడ వేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ, ఈడీ అటాచ్మెంట్ చేసేసరికి మూడు రాజధానుల పేరుతో కొత్త ఎత్తుగడ వేసారు వైఎస్. జగన్‌గారు. బినామిల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారు. మరో రూ.50 వేల కోట్లు కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరోసారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడు. 
 
విశాఖలో జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయం. వడ్డీతో సహా జగన్‌గారు, 8 నెలల నుండి విశాఖలో ఉండి ల్యాండ్ మాఫియా కింగ్‌పిన్‌గా మారిన వైఎస్ రెడ్డి భవిష్యత్‌లో ఊచలు లెక్కపెట్టడం ఖాయం" అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురు పిల్లల తల్లి.. ప్రియుడుతో కలిసి భర్తను చంపేసింది.. ఆపై ఏఎస్ఐతో లింకు..