Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచుగడ్డల కింద 18 గంటలు గడిపిన బాలిక.. కాలు విరిగింది..

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (16:39 IST)
మంచుగడ్డల కింద 18 గంటలపాటు 12 ఏళ్ల బాలిక గడిపింది. ఆ 12 గంటలు నరకం అనుభవించింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాక్‌కు చెందిన 12 ఏళ్ల సమినా బీబీ 18 గంటల పాటు మంచుగడ్డల కింద నరకం అనుభవించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం మంచులో మునిగిపోయిన వేళ.. అక్కడి నీలం లోయలో హిమపాతం వల్ల చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 
 
వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నీలం లోయలో సమినా కుటుంబం ఓ మూడంతస్తుల ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. సోమవారం వారుంటున్న ఇంటిపై మంచుగడ్డలు పడి ఆ ఇల్లు మునిగిపోయింది. ఆ ప్రమాదంలో సమినా సోదరి, సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. సమినా తల్లి షహనాజ్, ఆమె సోదరుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 
 
సమినా మాత్రం ఆ ఇంట్లోనే చిక్కుకుంది. దాదాపు 18 గంటల తర్వాత అధికారులు తనను గుర్తించి బయటకు తీశారు. ఆ గదిలో చిక్కుకున్నప్పుడు తాను అసలు నిద్రపోలేదని... ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురుచూస్తూ గడిపానని సమినా తెలిపింది. ప్రస్తుతం సమినా ముజఫరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో సమినా కాలు విరిగింది. ఇంకా సమినా రక్తం కక్కుకుంది. 
 
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్న వైద్యులు తెలిపారు. సమినా బతుకుతుందని తాము అసలు ఊహించలేదని సమినా తల్లి షహనాజ్ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా హిమపాతం వల్ల గత రెండు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 100కు పెరిగిందని పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments