Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కమలసేన ప్రభుత్వం తథ్యం : కన్నా లక్ష్మీనారాయణ

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (16:18 IST)
వచ్చే 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బీజేపీ రాష్ట్ర శాఖ కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. గురువారం విజయవాడలో బీజేపీ - జనసేన పార్టీల నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమతో కలిసి పనిచేసేందుకు జనసేన ముందుకు వచ్చిందని తెలిపారు. ఏపీలో సామాజిక న్యాయం బీజేపీ - జనసేనతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపైనా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనపైనా కలిసి పోరాటం సాగిస్తామన్నారు. 
 
ప్రజావ్యతిరేక విధానం ఏదైనా బీజేపీ, జనసేన సంయుక్తంగా ఉద్యమిస్తాయని చెప్పారు. బీజేపీ, జనసేన సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించాలన్న అంశాలపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా రాజధానిని తొలగించాలని నిర్ణయింస్తే రోడ్లపైకి వచ్చి పోరాడుతామని ప్రకటించారు. అంతేకాకుండా, 2024లో వచ్చేది తమ ప్రభుత్వమేనని కన్నా జోస్యం చెప్పారు. ఆ దిశగా తమ రెండు పార్టీలు కృషి చేస్తాయని తెలిపారు. రాజధాని అమరావతి అంశంలో కలిసి పని చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments