Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కలిపిన "కమలసేన" - అధికారంలోకి వస్తామన్న పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే నాలుగున్నరేళ్లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని రకాల ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు గురువారం విజయవాడలో సమావేశమైన బీజేపీ - జనసేన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటామనీ, రెండు పార్టీల్లో అవగాహనాలోపం రాకుండా అన్నీ చర్చించామనీ, బీజేపీ పెద్దలతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
 
ఇంకా పవన్ చెపుతూ... 'బీజేపీతో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నాం. బీజేపీ-జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీ, జనసేన రూపంలో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వస్తుంది. మోడీ, అమిత్‌ షా నమ్మకాన్ని నిలబెడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి నడుస్తామ'ని పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments