Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ పసుపు చికిత్సకు అమెరికాలో పేటెంట్ వచ్చేసింది..

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (15:56 IST)
పసుపుకు ఆయుర్వేదం దివ్యౌషధం అనే పేరుంది. యాంటీ-బ్యాక్టీరియల్‌గా పనిచేసే పసుపు వాపును తగ్గిస్తుంది. రక్తపు గడ్డలను కరిగించే శక్తి కూడా పసుపుకు వుంటుంది. ఈ నేపథ్యంలో కేన్సర్ వ్యాధికి కేరళ సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రకం పసుపు ట్రీట్‌మెంట్‌కు అమెరికాలో పేటెంట్ లభించింది.
 
కేన్సర్ వ్యాధి తిరగబెట్టకుండా పసుపుతో పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కొత్త ట్రీట్‌మెంట్‌ను తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ (యూఎస్ పీటీవో) నుంచి ఆమోదం లభించినట్లు ఇనిస్టిట్యూ ట్ హెడ్ లిస్సీ కృష్ణన్ వెల్లడించారు. 
 
ఇంకా కేన్సర్ కణాలను నాశనం చేసే గొప్ప గుణం పసుపులోని కుర్ క్యుమిన్ అనే రసాయనానికి ఉందని శ్రీచిత్ర ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే కుర్ క్యుమిన్ ను నేరుగా మందులా ఉపయోగించడం కుదరదని, అందుకే తాము దీనిని వాడేందుకు కొత్త టెక్ నాలజీని డెవలప్ చేశామన్నారు. 
 
ఆపరేషన్ ద్వారా కేన్సర్ ట్యూమర్లను తొలగించిన తర్వాత కొన్ని కేన్సర్ కణాలు మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ కణాలే తిరిగి మళ్లీ ట్యూమర్లుగా పెరుగుతాయి. అందుకే.. ట్యూమర్లను తొలగించాక, మిగిలిపోయే కేన్సర్ కణాలను అన్నింటినీ నాశనం చేసేందుకు కేరళ పసుపు ట్రీట్మెంట్‌ ఉపయోగపడుతుందని సైంటిస్టులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments