Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవులు రాక్షసులుగా మారిపోతున్నారా? చివరికి ఆవుపై కూడా అత్యాచారం

మానవులు రాక్షసులుగా మారిపోతున్నారా? చివరికి ఆవుపై కూడా అత్యాచారం
, గురువారం, 9 జనవరి 2020 (12:22 IST)
కలియుగంలో మానవులు రాక్షసులుగా మారిపోతున్నారు. కామవాంఛను తీర్చుకునేందుకు మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా.. మూగజీవులపై కూడా విరుచుకుపడుతున్నారు. అలాంటి దుర్ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో ఓ కామపిశాచి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆ ఆవును దారుణంగా చంపేశాడు.
 
పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌ అతనికున్న ఆవుల ద్వారా పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి ఆవుల మందనుండి ఒక ఆవు కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడిన వినోద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. కానీ బుధవారం ఓ ముళ్ల పొదలో అతని ఆవు విగతజీవిగా కనిపించింది. 
 
అంతేకాకుండా దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని తేలింది. ఇంకా పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆస్పత్రికి ఆవు కళేబరాన్ని తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడశిశువులు పుట్టారు.. ఆ గ్రామంలో పండగ చేసుకున్నారు.. ఎక్కడో తెలుసా?