Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలను డబ్బుతో వెలకడతారా? సీఎం జగన్ నిర్ణయం సబబుకాదు : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:30 IST)
విశాఖపట్టణం గ్యాస్ లీకేజీ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం ప్రకటించడాన్ని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పబట్టారు. ప్రాణాలను డబ్బుతో వెలకడతారా? అంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలపై ఎంతో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనను తేలికగా తీసికున్నట్టుగా ఉందని విమర్శలు చేశారు. 
 
అంతేకాకుండా ఈ ఘటనపై విచారణకు ముగ్గురు ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ కమిటీలోని ఏ ఒక్క సభ్యుడికి రసాయన శాస్త్రంపై ఏమాత్రం అవగాహన లేదని ఆరోపించారు. అలాంటపుడు ఈ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో ఇపుడే అర్థం చేసుకోవచ్చన్నారు.
 
ఇకపోతే, ఇలాంటి ప్రమాదాలు పునరావృతంకాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలు పాటించాలని చెప్పారు. జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమలు ఉండడం సరికాదని తెలిపారు. స్టిరీన్ లీక్ ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు.
 
'ఎవరికీ ప్రాణాలు తీసే హక్కు లేదు.. ఏదైనా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే కేవలం ఆ ఫ్యాక్టరీలోని కార్మికులే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ, మొదటిసారి ఏపీలో సాధారణ ప్రజలు ఇలా చనిపోయారు. ఇందుకు కారణమైన వారు ఎంతటి వారైనా వదలిపెట్టడానికి వీల్లేదు. విశాఖలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. జనాలు చాలా భయంతో గురువారం పరుగులు తీశారు' అని చంద్రబాబు గుర్తుచేశారు.
 
లాక్‌డౌన్‌ వల్లే ప్రమాదం జరిగిందా? అన్న విషయంపై కూడా దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో ఉన్న సైరన్‌ కూడా మోగలేదని సీఎం జగనే చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ స్పందించిన తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రమాదాలను తేలికగా తీసుకునే విధంగా ఆయన చేసిన ప్రకటన ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shashti purthi : రాజేంద్రప్రసాద్ నటించిన షష్టి పూర్తి మూవీ రివ్యూ

పోలీస్ కంప్లెయింట్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments