Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో పీవీపీకి ఊరట... విజయవాడలో ప్రత్యక్షమైన వైకాపా నేత

Webdunia
బుధవారం, 1 జులై 2020 (14:19 IST)
విజయవాడకు చెందిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. 
 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని విల్లా గొడవలో పీవీపీపై కేసు నమోదైంది. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి, సదరు కొనుగోలుదారుణ్ని చంపేస్తానని బెదిరించారు. 
 
దీంతో బెదిరిపోయిన కొనుగోలుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
 
ఇదిలావుండగా, హైకోర్టులో ఊరట లభించిన తర్వాత ఆయన విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. బెంజ్‌సర్కిల్ దగ్గర 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీవీపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొద్దిసేపు సీఎం జగన్‌తో ముచ్చటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments