Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో పీవీపీకి ఊరట... విజయవాడలో ప్రత్యక్షమైన వైకాపా నేత

Webdunia
బుధవారం, 1 జులై 2020 (14:19 IST)
విజయవాడకు చెందిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. 
 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని విల్లా గొడవలో పీవీపీపై కేసు నమోదైంది. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి, సదరు కొనుగోలుదారుణ్ని చంపేస్తానని బెదిరించారు. 
 
దీంతో బెదిరిపోయిన కొనుగోలుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
 
ఇదిలావుండగా, హైకోర్టులో ఊరట లభించిన తర్వాత ఆయన విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. బెంజ్‌సర్కిల్ దగ్గర 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీవీపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొద్దిసేపు సీఎం జగన్‌తో ముచ్చటించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments