Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ఎన్నికలు : జేడీఎస్ తరపున పవన్ ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు.

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (09:08 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ, జేడీఎస్‌లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న జేడీఎస్ తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి వెల్లడించారు.
 
ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే స్టార్‌ క్యాంపెయినర్‌లుగా 'జాగ్వార్‌' హీరో నిఖిల్‌, హీరోయిన్‌ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేస్తారని కుమారస్వామి వివరించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments