Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్సాలో గ్యాంగ్‌రేప్‌... ఘజియాబాద్‌లో ఘోరం...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపర్వం మాత్రం ఆగడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటన మరువకముందే తాజాగా ఘజియాబాద్‌లో మరో దారుణం జరిగింది.

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (09:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపర్వం మాత్రం ఆగడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటన మరువకముందే తాజాగా ఘజియాబాద్‌లో మరో దారుణం జరిగింది. అదీ కూడా ఓ మదర్సాలో. పదకొండేళ్ల బాలిక గ్యాంగ్‌రేప్‌కు గురైంది. బాలికను పోలీసులు ఈనెల 22న రక్షించగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈనెల 21వ తేదీన ఆమె మార్కెట్‌కు వెళ్లేటపుడు స్నేహితుడిని కలుద్దామని చెప్పి పొరుగింటి బాలిక ఆమెను ఘజియాబాద్‌లోని మైనర్‌ బాలుడి వద్దకు తీసుకెళ్లింది. అక్కడ మదర్సా మౌలీ, మైనర్‌ ఆమెను మదర్సాలోని ఓ గదిలో బంధించి లైంగిక దాడులకు పాల్పడ్డారు. తరగతి గదుల్లో వినిపించే అరుపులతో ఆమె ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. మదర్సాకు వచ్చేవారు కూడా తనను అసభ్యకరంగా తాకేవారని బాలిక చెప్పింది. బాధిత బాలిక  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. 
 
మౌల్వీ గులామ్‌ షాహిద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను అసభ్యంగా తాకిన వారినీ గుర్తించేందుకు గాలింపు చేపట్టారు. బాధితురాలిని రక్షించడానికి వెళ్లినపుడు ఆమె ఓ చాపలో చుట్టబడి ఉందని పోలీసులు తెలిపారు. మైనర్‌ బాలుడు కూడా మదర్సా విద్యార్థే. అయితే బాలికను మౌల్వీ కిడ్నాప్‌ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం