Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేత గుప్తా దాడి ఘ‌ట‌న‌పై సూమోటోగా కేసు...

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:04 IST)
ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావుపై దాడి చేసిన సొంత పార్టీ నేతల వ్య‌వ‌హారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చిన సుభానీ గ్యాంగ్ పైన పోలీసులు సూమోటోగా రెండు కేసులు పెట్టారు.


ఒక స‌భ‌లో వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన సుబ్బారావు గుప్తాపై వైసీపీ గ్యాంగ్ దాడి చేసింది. వారి నుంచి ప్రాణ భయంతో ఓ లాడ్జ్‌లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ దాడి చేశారు. సుబ్బారావుపై దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీపై పోలీసులు కేసులు పెట్టారు. 
 
 
ఓ మంత్రి, ఎమ్మెల్యేల మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని ఇటీవల మంత్రి బాలినేని బర్త్ డే వేడుకల్లో మాట్లాడిన సుబ్బారావు గుప్తాపై దాడి జ‌రిగింది. సుబ్బారావు వ్యాఖ్యలపై ఆగ్రహంతో దాడి చేసిన సుభానీ నిన్న రాత్రి సుబ్బారావు ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు.


పార్టీకి నష్టం కలుగుతుందనే అలా మాట్లాడానన్న సుబ్బారావు బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించాడు సుభానీ. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు సూమోటోగా కేసులు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments