Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సభలకు నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్న పోలీసులు

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (11:47 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు నాయుడు నిర్వహించే రోడ్‌షోలకు, బహిరంగ సభలకు ఏపీ పోలీసులు భద్రత కల్పించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కేవలం నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్నారు. ఈ కారణంగా బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన రోడ్‍షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది చనిపోయారు. దీనికి కారణం సరైన పోలీస్ భద్రత లేకపోవడమేననే విమర్శలు వస్తున్నాయి. ఇది స్థానికంగానే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వేతర కార్యక్రమాలకు వస్తే మాత్రం వేలాది మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. అదే చంద్రబాబు పర్యటనలకు మాత్రం పోలీసులు ఏమాత్రం శ్రద్ధ చూపించడంలేదు. నామమాత్రపు భద్రతతో మమ అనిపించేస్తున్నారు. 
 
ఈ నెల 20వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ విందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హాజరయ్యారు. ఆ రోజు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఈ నెల 26వ తేదీ మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. 
 
ఆ తర్వాత రోజు అంటే ఒక్క రోజు వ్యవధిలో జగన్ జిల్లాకు వచ్చారు. కేవలం ఒక్క రోజులోనే వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం వేళ్ళమీద లెక్కించే స్థాయిలో పోలీసులతో భద్రత కల్పించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments