చంద్రబాబు సభలకు నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్న పోలీసులు

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (11:47 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు నాయుడు నిర్వహించే రోడ్‌షోలకు, బహిరంగ సభలకు ఏపీ పోలీసులు భద్రత కల్పించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కేవలం నామమాత్రపు బందోబస్తుతో మమ అనిపిస్తున్నారు. ఈ కారణంగా బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన రోడ్‍షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది చనిపోయారు. దీనికి కారణం సరైన పోలీస్ భద్రత లేకపోవడమేననే విమర్శలు వస్తున్నాయి. ఇది స్థానికంగానే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వేతర కార్యక్రమాలకు వస్తే మాత్రం వేలాది మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. అదే చంద్రబాబు పర్యటనలకు మాత్రం పోలీసులు ఏమాత్రం శ్రద్ధ చూపించడంలేదు. నామమాత్రపు భద్రతతో మమ అనిపించేస్తున్నారు. 
 
ఈ నెల 20వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ విందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హాజరయ్యారు. ఆ రోజు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఈ నెల 26వ తేదీ మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. 
 
ఆ తర్వాత రోజు అంటే ఒక్క రోజు వ్యవధిలో జగన్ జిల్లాకు వచ్చారు. కేవలం ఒక్క రోజులోనే వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం వేళ్ళమీద లెక్కించే స్థాయిలో పోలీసులతో భద్రత కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments