Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు తొక్కిసలాట మృతులకు ప్రధాని ఆర్థిక సాయం

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (11:26 IST)
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్వహించిన రోడ్‍‌షోలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థికసాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.2 లక్షస చొప్పున ఎక్స్‌గ్రేషియా అందచేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. 
 
అలాగే, ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధి నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలుచొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రధాని ప్రకటించారు. 
 
కాగా, బుధవారం చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి రోడ్‌షో సభకు, టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించడంతో ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. 
 
కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, టీడీపీ తరపున మృతులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments