Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట కర్ఫ్యూను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (22:21 IST)
రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని భావించింది. అయితే, రాత్రిపూట కర్ఫ్యూ అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ నెల 18వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలుకానుంది. ఇటీవల కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ తాజాగా మరోమారు జారీచేసింది. 
 
ఇదే అంశంపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని స్పందిస్తూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి పెరిగినప్పటికీ దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్నిరకాల వైద్య సదుపాయాలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. 
 
అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేసే ఉల్లంఘించేవారిపట్ల కఠినంగా వ్యవహించాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యంగా, మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments