Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సీఎం జగన్‌కు అనుకూలంగా తీర్పు

Advertiesment
ఏపీ సీఎం జగన్‌కు అనుకూలంగా తీర్పు
, మంగళవారం, 11 జనవరి 2022 (15:00 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులో ఊరట కలిగింది. ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఒకటి వెలువడింది. సాక్షి పత్రికను నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టిన పెట్టుబడుల కేసులో వైఎస్. జగన్, జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయన్న పన్ను శాఖ అప్పీలెట్ ట్రైబునల్ తీర్పును వెలువరించింది. 
 
జగతి పబ్లికేషన్‌‍లో వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు క్విడ్ ప్రోకోగా చూడలేమంటూ అప్పీలేట్ ట్రేబ్యునల్ తేల్చిచెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెందిన కంపెనీలపై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లో చాలా ముఖ్యమైన కేసుల్లో సాక్షి పెట్టుబడుల కేసు ఒకటి. దీంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్టయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం