Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కరోనా దూకుడు - కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు

ఏపీలో కరోనా దూకుడు - కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు
, మంగళవారం, 11 జనవరి 2022 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దూకుడుగా కొనసాగుతోంది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ఇందులోభాగంగా రాత్రిపూట కర్ఫ్యూను కూడా అమలుచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు కేసులను వర్చువల్ విధానంలో విచారంచాలని నిర్ణయించినట్టు పేర్కొంది. 
 
కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంక్రాంతి పండుగల సెలవుల తర్వాత అంటే ఈ నెల 17వ తేదీ నుంచి వర్చువల్ విధానంలోనే కేసుల విచారణ చేపట్టాలని రాష్ట్రంలోనిఅన్ని కోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో కోర్టులో ఇక ప్రత్యక్ష విచారణ కాకుండా కేవలం ఆన్‌లైన్ విధానంలోనే కొనసాగించనున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ఉధృతరూపం దాల్చినపుడు కూడా ఆన్‌లైన్‌లోనే కేసుల విచారణ జరిగిన విషయం తెల్సిందే. 
 
ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు విధిస్తుంది. ఇందులోభాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అలాగే, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఒక సీటు విడిచి మరో సీటులో కూర్చొని సినిమా తిలకించేలా షరతులు విధించింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో పాటు.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, రాత్రిపూట కర్ఫ్యూ నుంమచి ఆస్పత్రులు, ఫార్మసీ దుకాళాలు, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌ట్ట‌ప్ప‌ను చంపింది ఎవ‌రు... ఆర్జీవీ సినిమా టిక్కెట్ల ట్వీట్!