Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు..
, మంగళవారం, 11 జనవరి 2022 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. గతంలో ఈ నెల 14, 15, 16 తేదీలను సంక్రాంతి సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. 
 
అయితే, తాజాగా ఈ నెల 13వ తేదీ గురువారం, 14వ తేదీ శుక్రవారం, 15వ తేదీ శనివారాలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగలుగా పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. 
 
కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను కూడా అమలు చేయనున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. 
 
ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు విధిస్తుంది. ఇందులోభాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అలాగే, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఒక సీటు విడిచి మరో సీటులో కూర్చొని సినిమా తిలకించేలా షరతులు విధించింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో పాటు.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, రాత్రిపూట కర్ఫ్యూ నుంమచి ఆస్పత్రులు, ఫార్మసీ దుకాళాలు, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం... అనేక మందికి పాజిటివ్