Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త టెన్త్ - ఇంటర్ టైం టేబుల్ షెడ్యూల్ వెల్లడి

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (21:48 IST)
జాతీయ స్థాయిలో నిర్వహించే, జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు రావడంతో పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త టైం టేబుల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ కూడా కొత్త టైం టేబుల్‌ను ప్రకటించింది. 
 
తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
పదో తరగతి పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే, ఇంటర్ పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మే 6 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. 
 
కాగా, పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రకటించిన కొత్త టైం టేబుల్ ప్రకారం ఈ నెల 27వ తేదీన తెలుగు, 28వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 29వ తేదీన ఇంగ్లీష్, మే 2వ తేదీన గణితం మే 4న సైన్స్ పేపర్ 1, మే 5న సైన్స్ పేపర్ 2, మే 6న సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments