Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్న బాక్సైట్ రెడ్డి!

Webdunia
శనివారం, 10 జులై 2021 (17:12 IST)
బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడ‌ని టీడీపీ యువ‌నేత  నారా లోకేశ్ విమ‌ర్శించారు. విశాఖ మన్యం ఏరియాలో లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల‌ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నార‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించారని లోకేశ్ వెల్లడించారు.

పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలతో తాను ఫోన్లో మాట్లాడానని తెలిపారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యంలో జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇది 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అని పేర్కొన్నారు.

బాక్సైట్ రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డిని మించిపోతున్నాడని, తన బంధువులైన వైవీ విక్రాంత్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలతో మైనింగ్ మాఫియా పనులు చేయిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేంత వరకు పోరాడాలని టీడీపీ నేతలకు సూచించానని లోకేశ్ వివరించారు.

అభయారణ్యాన్ని ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ, గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతూ చెలరేగిపోతున్న వైసీపీ మైనింగ్ మాఫియాను తరిమికొట్టేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments