Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధితులకు నారా భువనేశ్వరి రూ.2 కోట్ల విరాళం

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుని ఇక్కట్లు పడుతున్నారు. ఇలా వరద నీటిలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న బాధితులకు సహాయం చేసేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. ఇటు తెలుగు చిత్ర సీమకు చెందిన వారు కూడా భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
 
ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
 
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. "కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలి. సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మనం వారికి చేసే అతిపెద్ద సాయం. తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాల మీద ప్రభావం చూపించాయి. వరద నీటిలో చిక్కుకుపోయి ఎంతో మంది ఇక్కట్లు పడుతున్నారు.
 
బాధిత ప్రాంతాలు, ప్రజలకు అందించే సహకారంలో మేం చేసిన ఈ సాయం వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించడం జరిగింది. వరద ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది" అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments