Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వయనాడ్ బాధితుల కోసం 'బాహుబలి' దానం!!

prabhas

వరుణ్

, బుధవారం, 7 ఆగస్టు 2024 (12:17 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు, కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సయక చర్యలు చేపట్టేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చిన తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, మోహన్ లాల్, చియాన్ విక్రమ్, సూర్య - జ్యోతిక దంపతులు, హీరో కార్తి, కమల్ హాసన్, నయనతార - విఘ్నేశ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ ఇలా అనేక మంది విరాళాలు ఇచ్చారు. 
 
తాజాగా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ భారీ విరాళం ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో సంభవించిన ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విరాళం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. జూలై 30వ తేదీన కురిసిన కుంభవృష్టితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం విషయం తెల్సిందే. కొండ చరియలు విరిగిపడి దాదాపు 300 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ తెలియలేదు. ఈ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ బిగ్ బాస్‌కు దూరమైన కమల్ హాసన్.. కారణం ఏంటంటే?