ఊపిరి పీల్చుకున్న ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్‍‌‌ను రద్దు చేయాలంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో సీఎం జగన్ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు గత జూలై నెలలోనే ముగిశాయి. అయితే తీర్పును అప్పటి నుంచి కోర్టు రిజర్వు చేసింది. తాజాగా బుధవారం తీర్పు వెల్లడించింది.
 
అక్రమాస్తుల కేసులో భాగంగా ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలతో, కోర్టుకు గైహాజరవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments