Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్‍‌‌ను రద్దు చేయాలంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో సీఎం జగన్ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు గత జూలై నెలలోనే ముగిశాయి. అయితే తీర్పును అప్పటి నుంచి కోర్టు రిజర్వు చేసింది. తాజాగా బుధవారం తీర్పు వెల్లడించింది.
 
అక్రమాస్తుల కేసులో భాగంగా ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలతో, కోర్టుకు గైహాజరవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments