Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదా గ్రామంలో వివాహితపై వైకాపా నేత అత్యాచారయత్నం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఆగడాలు రోజురోజుకూ హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా, బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఏమాత్రం విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లాలోని పరిగి మండల పరిధి మోదా గ్రామంలో వివాహితపై వైసీపీ నేత అత్యాచారయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి మోదా గ్రామానికి ఇటీవల ఓ కుటుంబం వలస వచ్చింది. బుధవారం కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా మహిళపై గ్రామానికి చెందిన వైసీపీ నేత కుమారుడు అరుణ్‌కుమార్.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఆ కామాంధుడు నుంచి తప్పించుకునేందుకు వివాహిత బిగ్గరగా కేకలు వేసింది. ఈ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడు చేరుకుని ఇంటి తలుపులు బద్దలు కొట్టి మహిళను రక్షించారు. స్థానికులను చూడగానే అరుణ్‌కుమార్ అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments