Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతకు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు... మారుతీ రావు వీలునామా?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (11:32 IST)
మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రియల్టర్ మారుతీ రావు ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఆర్యవైశ్య సత్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఆత్మహత్య కేసులో మారుతీ రావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటిని ప్రణయ్ హత్య కేసు విచారణ సమయంలో కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే, ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మరణించడంతో, అతని పేరును తొలగించి, మిగతా వారిపై విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు.
 
అయితే, వీలునామా పత్రాల్లో తన కుమార్తె పేరు మీద ఒక్క పైసా కూడా మారుతీ రావు రాయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తానెంతగానో ప్రేమతో చూసుకున్న కుమార్తె, ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు. 
 
తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరిట ఆయన ఒక్క పైసా కూడా రాయలేదు. 
 
గతంలో అమృత భర్త ప్రణయ్ హత్య తర్వాత, తన ఆస్తిలో అధిక భాగాన్ని మారుతీ రావు కుమార్తె పేరిటే రాశారన్న సంగతి తెలిసిందే. ఆపై జరిగిన పరిణామాలు ఆయన తన వీలునామాను మార్చుకునేలా చేశాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments