Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి భార్యపై లైంగిక వేధింపులు.. పురుగుల మందు తాగి..?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:57 IST)
తమ్ముడి భార్యపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన గీతాసురేఖకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
 
శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆదిశేషు పెద్ద కుమారుడు శివశంకర్.. శ్రీనివాసరావు భార్యపై కన్నేశాడు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అతని భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ పలుమార్లు వేధించాడు.
 
ఈ వేధింపులతో గీతాసురేఖ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే జనవరి 15న పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక, మెరుగైన చికిత్స కోసం గీతాసురేఖను విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం గీతాసురేఖ మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం