Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌నం ప‌ల్ల‌కీలు మోయ‌డ‌మేనా? మ‌న జాతికి స్వాతంత్రం రాలేదన్న ముద్ర‌గ‌డ‌

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (12:17 IST)
కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి త‌నదైన శైలిలో స్పందించారు. ఎన్నాళ్ళు మ‌నం ప‌ల్ల‌కీలు మోయాలంటూ బీసీ, కాపు, దళిత సోదరులకు ముద్రగడ బ‌హిరంగ లేఖ రాశారు.
 
 
బీసీ, కాపు, దళిత సోదరులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దిశానిర్దేశం చేసే ప్ర‌య‌త్నం మ‌రోసారి చేశారు. ఆయా వ‌ర్గాల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ‘‘మన‌దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదు.  తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి? ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన చేయాలి. మన జాతుల జీవితాలు పల్లకీలు మోయడానికేనా? ఎన్నటికీ పల్లకిలో కూర్చునే అవకాశం తెచ్చుకోలేమా? అని ముద్ర‌గ‌డ ఘాటుగా ప్ర‌శ్నించారు.
 
 
తాము ఎవరికీ వ్యతిరేకం కాదని... అలాగే ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. వాస్త‌వానికి ముద్ర‌గ‌డ తాను కాపు ఉద్య‌మం నుంచి విర‌మించుకుంటున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. కానీ, ఈసారి ఆయ‌న బ‌హిరంగ లేఖ‌తో మ‌ళ్ళీ ఏపీ పాలిటిక్స్ లోకి రావ‌డంతో ఆయ‌న మ‌రో రాజ‌కీయ ఉద్య‌మానికి సిద్ధం అవుతున్నార‌ని ఆయా వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments