వ‌సంత నియోజ‌కవ‌ర్గం మైల‌వ‌రంలో విభేదాలు సృష్టిస్తే ఖ‌బ‌డ్డార్!

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (11:49 IST)
కృష్ణా జిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య భ‌గ్గుమంటున్న వివాదాల‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ పెట్టారు. ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ను ఆయ‌న స‌పోర్ట్ చేస్తూ, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రంలో విభేదాలు సృష్టించే వారికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే, భవిష్యత్తులో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థిగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేస్తే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టే లెక్క అన్నారు. అలాంటి వారిపై పార్టీలో కఠిన చర్యలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. 
 
 
జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు... ఆయన అక్కడే కొనసాగుతారు. వారిద్దరి మధ్య అనవసర విభేదాలు సృష్టిస్తే ఉరుకోం. అలా ఎవరైనా చేస్తే, వారిని పార్టీ  నుండి బయటకు పంపేందుకు కూడా వెనుకాడం అని వార్నింగ్ ఇచ్చారు. అందరూ కలిసి మెలిసి పని చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంద‌ని, అనవసర వివాదాలకు దారితీసే ప‌రిస్థితుల‌ను సృష్టించ‌వ‌ద్ద‌ని వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించేవారికి హెచ్చ‌రిక‌లు చేశారు. మీరు ఇలాంటి పార్టీ వ్య‌తిరేక చర్యలు ఉపసంహరించాల‌ని పెద్దిరెడ్డి సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments