Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ మాత్రం వైసీపీ అభ్యర్థి గెలుస్తారు: కేఏ పాల్

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:29 IST)
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఏపీలో 76.69 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ముందు మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా తానే కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

 

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. తన వినూత్న ప్రచారంతో పలువురిని ఆకట్టుకున్నారు.
 
ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కేఏ పాల్ అభ్యర్థించారు. నిన్నటివరకు నరసాపురంలో ప్రజాశాంతి పార్టీదే గెలుపు అంటూ వచ్చిన పాల్ తాజాగా ప్లేట్ మార్చేశారు. నరసాపురంలో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతున్నారు. 
 
నరసాపురం లోక్‌సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ ఈవీఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని కేఏ పాల్ జోస్యం చెప్పారు. కాగా ఎన్నికల కమిషన్ భారత ప్రధాని నరేంద్రమోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. అవినీతిపై యుద్ధానికి పెద్ద ఎత్తున యువత తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments