Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కోసం రోడ్డుపై పరుగెత్తిన భార్య, ఇంకో మహిళతో వెళ్ళిపోయిన భర్త, తండ్రి వద్దంటూ కూతురు

Webdunia
గురువారం, 23 జులై 2020 (22:31 IST)
పోలీసులు తనకు న్యాయం చేయడం లేదంటూ తిరుపతిలో ఓ మహిళ, పోలీస్టేషన్ ఎదుట రోడ్డుపై కన్నబిడ్డతో సహా కూర్చుని న్యాయం కోసం పోరాటం చేసింది. మండుటెండలో గాంధీ విగ్రహం ముందు కూర్చుని న్యాయం కావాలంటూ బోరున విలపించింది. కానీ భర్త మాత్రం వేరొక మహిళను మోటారు బండిపై ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
 
మహిళ బోరున విలపిస్తూ ఉండగా కూతురు తల్లిని ఓదారుస్తూ అమ్మ నాకు తండ్రి వద్దు ఆ ఫోనులో డాడీ ఫోటోలు, నెంబర్ డిలీట్ చేసేయ్ అంటూ ఆ చిన్నారి కూడా రోడ్డుపై ఏడుస్తూ కనిపించడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. 
 
తిరుపతిలో నివాసముంటున్న వెంకటాచలం, సరస్వతిలు 13 యేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక వెంకటాచలం మరో మహిళకు దగ్గరయ్యాడు. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. భర్త ప్రవర్తనతో విసుగుచెందిన మహిళ ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది.
 
కానీ పోలీసులు ఉదయం నుంచి ఫిర్యాదు తీసుకోకుండా కాలయాపన చేయడంతో మహిళ ఆవేదనతో రోడ్డుపై నిరసనకు కూర్చుంది. ఆమె భర్త కూడా రెండో భార్యను తీసుకుని స్టేషన్‌కు రావడంతో ఆగ్రహించిన మహిళ సరస్వతి అతనితో గొడవకు దిగింది. దీంతో ఆమె భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. నడిరోడ్డుపై మహిళ న్యాయం కోసం పోలీస్టేషన్ ఎదుట బైఠాయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యాయం కావాలంటూ మహిళ, ఎస్పీని ఆశ్రయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments