Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చికెన్‌లో మత్తు కలిపి... తల్లీకూతుళ్లపై ఇంటి యజమాని అత్యాచారం.. ఎక్కడ?

చికెన్‌లో మత్తు కలిపి... తల్లీకూతుళ్లపై ఇంటి యజమాని అత్యాచారం.. ఎక్కడ?
, బుధవారం, 22 జులై 2020 (23:02 IST)
హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో దారుణం జరిగింది. చికెన్‌ కూరలో మత్తుమందు కలిపి ఇచ్చిన ఇంటి యజమాని... ఆ తర్వాత తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి ఇంటి యజమాని స్నేహితులు కూడా పాలుపంచుకున్నారు. అలాగే, అతనికి ఓ మహిళ సహకారం అందించినట్టు సమాచారం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ సందయ్య నగర్‌కు చెందిన గంగాధర్‌ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి అద్దెకు నివసిస్తున్నారు. అయితే, కూలి పని చేరుకొని జీవనం సాగించే వీరిలో అద్దె ఇంట్లో నివసించే మహిళకు, ఆమె కుమార్తెకు మత్తు పదార్థం కలిపిన చికెన్‌ కూర ఇచ్చాడు. 
 
దీన్ని ఆరగించిన కొద్దిసేపటికే మహిళ, ఆమె కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. అనంతరం గంగాధర్‌, అతని ఇద్దరు స్నేహితులు మైనర్‌ బాలిక, ఆమె తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఇంటి యజమాని, అతని స్నేహితులకు మరో మహిళ సాయం చేసిందని స్థానికులు తెలిపారు. 
 
ఈ క్రమంలో కూలి పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చిన భర్తకు భార్య, కూతురు, కుమారుడు స్పృహలో లేకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతో స్థానికులకు, దాంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ వేసుకోలేదని చీరాల యువకుడిని చితక్కొట్టిన ఎస్సై, మృతి