Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 28న జేఈఈ పరీక్షలు.. నైపర్ ప్రకటన

Advertiesment
NIPER JEE 2020
Online Exams
జేఈఈ పరీక్షా తేదీని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్‌) ప్రకటించింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 28వ తేదీన ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామని నైపర్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మా, ఎంఎస్ ఫార్మా, ఎంటెక్ ఫార్మా, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 14న జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాడు. కరోనాతో జూలై 25కు వాయిదా పడిన ఈ పరీక్షలను అదే రోజున నిర్వహించుటకు కుదరకపోవడంతో పరీక్ష మరోమారు వాయిదాపడింది. తాజాగా పరీక్షను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలకోసం అధికార వెబ్‌సైట్ niperahm.ac.in చూడవచ్చని నైపర్ వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈని అహ్మదాబాద్‌లోని నైపర్ నిర్వహిస్తోంది.
 
నైపర్ జేఈఈ ద్వారా అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, హాజీపట్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్ఏఎస్ నగర్‌లోని నైపర్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లో మాస్టర్ ఇన్ ఫార్మసీ (ఎంఫార్మా), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ ఫార్మా), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్ ఫార్మా), పీహెచ్‌డీ ప్రోగామ్‌ల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీల్లో 820 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. బ్లాక్ మెయిల్.. అత్యాచారం..