కరోనా వైరస్‌తో ఆగిన పెళ్లి.. తెలంగాణలో ఒకే రోజు 1,567 కేసులు

Webdunia
గురువారం, 23 జులై 2020 (22:03 IST)
కరోనా కారణంగా పెళ్లి ఆగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో పెళ్లి ఆగిపోయింది. ఆనందంతో పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా కల్యాణ ఘడియలకు ఒక్క రోజు ముందు పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌ అని సంక్షిప్త సందేశం అందింది. దీంతో అతడిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించడంతో పెళ్లి ఆగిపోయింది. 
 
పెళ్లి కుమారుడికి జ్వరం రావడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఫలితం పాజిటివ్‌ రావడంతో పెళ్లి పనుల్లో పాలుపంచుకున్న వారంతా ఇప్పుడు భయాందోళనతో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో కొత్తగా గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
 
కొత్తగా కరోనాతో కోలుకున్న1,661 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 39,327కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments