Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ నుంచి కోలుకున్న అమితాబ్ బచ్చన్!

కరోనా వైరస్ నుంచి కోలుకున్న అమితాబ్ బచ్చన్!
, గురువారం, 23 జులై 2020 (18:03 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. ఇటీవల అమితాబ్‌తో పాటు... ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు తొలుత కోవిడ్ వైరస్ సోకింది. దీంతో వారిని ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యలు ఈ వైరస్ బారినపడ్డారు. వీరిని కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. 
 
ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. కరోనా గురించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ధైర్యం చెప్పారు. తాము కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
 
తాజాగా అమితాబ్ ఆరోగ్యం గురించి నానావతి ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ... ఆయన టెస్టు రిపోర్టులన్నీ సాధారణంగానే ఉన్నాయనీ పేర్కొన్నాయి. బ్లడ్, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు. 
 
మరోవైపు, అమితాబ్‌కు ఇంకా ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదనీ, తనకు కరోనా నెగెటివ్ అంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అమితాబ్ కుటుంబ సభ్యులు స్పందించాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్.. మీసాలు తీసేసి కుర్రాడిలా..!