Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభవార్త చెప్పిన సీరమ్ ఇనిస్టిట్యూట్ : అక్టోబరు నాటికి కోవిషీల్డ్ వ్యాక్సిన్

శుభవార్త చెప్పిన సీరమ్ ఇనిస్టిట్యూట్ : అక్టోబరు నాటికి కోవిషీల్డ్ వ్యాక్సిన్
, గురువారం, 23 జులై 2020 (09:41 IST)
ప్రపంచానికి అమెరికాకు చెందిన సీరన్ ఇనిస్టిట్యూట్ ఓ శుభవార్త వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు, ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు వీలుగా వ్యాక్సిన్ తయారు చేస్తోంది. దీనిపేరు కోవిషీల్డ్. ఇది వచ్చే అక్టోబరు నాటికి అందుబాటులోకి వస్తుందని తాజాగా ప్రకటించింది. 
 
అదేసమయంలో దేశంలో వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అపుడు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ టీకా ‘కొవిషీల్డ్’ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు పూనావాలా వెల్లడించారు. 
 
కాగా, దేశీయంగా ఉత్పత్తి చేసిన ‘కోవాగ్జిన్’ టీకాను మానవులపై ప్రయోగించేందుకు భువనేశ్వర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్‌యూఎంలో స్క్రీనింగ్ ప్రారంభమైంది. కాగా, అక్టోబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ టీకా వస్తుందన్న పూనావాలా వ్యాఖ్యలకు విరుద్ధంగా, టీకా డిసెంబరు నాటికి అందుబాటులో వస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలా చెప్పడం గమనార్హం.
 
మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ టీకా తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, ఆస్ట్రియాలో రెండు, మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. భారత్‌లో కనీసం వందకోట్ల డోసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని, పేదలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువకే దీనిని అందుబాటులో ఉంచుతామని సైరస్ పూనావాలా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిఖిలా?... వాడెవడు?.. వర్మ సెటైర్లు