Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లా పాత కలెక్టర్ కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:14 IST)
కోర్టు ధిక్కరణ అంశంలో కృష్ణా జిల్లా పాత కలెక్టర్ ఎండి ఇంతియాజ్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) ఎం.శ్రీనివాసరావుపై హైకోర్టు నాన్  బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
వారిద్దరినీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తూ
విచారణను ఈనెల 28కి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. 
 
అర్హత ఉన్నప్పటికీ తమకు 'వైఎస్సార్ చేయూత' పథకం వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.
 
వారికి ప్రయోజనాలు కల్పించాలని గతేడాది అక్టోబరు 22న హైకోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే 2020-21 సంవత్సరానికి అధికారులు నిధులు మంజూరు చేశారు. 
 
అయితే 2019-2020 సంవత్సరానికి ప్రయోజనాలు కల్పించలేదని బాధితులు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణకు వస్తున్నందున ఉలిక్కిపడిన అధికారులు ఇటీవల 2019-2020 సంవత్సర నిధులు విడుదల చేశారు. 
 
దీనిపై బుధవారం జరిగిన విచారణకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్, డీఆర్‌డీఏ పీవోలు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు సైతం హాజరుకాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరిపై  కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments