Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ వేధింపులు... గ్రామ వలంటీరు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (17:48 IST)
ఓ మహిళ దుర్భాషలాడటంతో భరించలేని ఓ వలంటీరు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీలుగుమిల్లి మండలం దర్భగూడెం పంచాయతీ పండువారిగూడెంకు చెందిన పండు నవీన(23) ఇటీవల గ్రామ వలంటీరుగా సొంతూరిలోనే విధులు నిర్వహిస్తోంది. 
 
గ్రామానికి చెందిన పూనెం మంగ తన ఆధార్‌ కార్డులో ఇంటి పేరు మార్చాలని కోరారు. శనివారం సదరు మహిళ ఆధార్‌లో పేరు మార్పు విషయంపై నవీనపై దుర్బాషలాడింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవీన రాసిన సూసైడ్‌ నోట్‌ ద్వారా ఈ విషయాలు తెలిశాయని తండ్రి శ్రీరామ్మూర్తి వాపోయాడు.
 
వలంటీరు నవీనను చూసిన తోటి వలంటీర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వలంటీర్లకు ముందుగా మానసికంగా సిద్ధపడేలా శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చాల్సిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొందరు వలంటీర్లు మాత్రం మండల అధికారులు పరిష్కరించాల్సిన సమస్యలు తమపై రుద్దడం దారుణమని వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments