Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు సాక్షిగా టిడిపిలో ముసలం

Advertiesment
East Godavari
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (15:02 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తెలుగు తమ్ముళ్లు డుమ్మా కొడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశానికి రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఈ నెల 9వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 
 
తోట త్రిమూర్తులు బాటలో కాకినాడ సిటీ నియోజకవర్గం నాయకులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 
కాకినాడ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబుతో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు కూడా హాజరుకాలేదు. పైగా, కాకినాడి సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై నున్న దొరబాబు వర్గం అసంతృప్తిగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో అది ఉందంటూ తప్పుడు సమాచారం.. ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్..