Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల పంచాయతీ : జగన్‌పై బాబు ధ్వజం

రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల పంచాయతీ : జగన్‌పై బాబు ధ్వజం
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:23 IST)
రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల పంచాయతీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన శుక్రవారం తూగో జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాను. 
 
కార్యకర్తలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ వైకాపా ప్రభుత్వ బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పునరావాస నిధిని ఏర్పాటు చేసాం. దుర్మార్గమైన, రాక్షస పాలన ఇంత వరకు ఎక్కడ చూడలేదు. 
 
వైఎస్, విజయభాస్కర్ రెడ్డి ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినప్పటికీ వారు దాన్ని పరిమితం చేసారు. మిగతా జిల్లాల్లో హుందాగా ఉన్నారు. కాని జగన్ పులివెందుల పంచాయితీ రాష్ట్రమంతా చేయాలని చూస్తున్నారు. ఇంత పనికిమాలిన ప్రభుత్వం నా 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చూడలేదు. 
 
వైసిపి కు క్యాడర్ లేదు. అందుకే టిడిపి క్యాడర్‌ను ధ్వంసం చేయాలని చూస్తున్నారు. నా మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, సెక్యూరిటీని తగ్గించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పాద యాత్రకు పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇచ్చాము.
 
 నా ఇళ్లు ముంచి రాజకీయాలు చేసి అప్రదిష్ట పాలయ్యారు. తూర్పుగోదావరి వంటి ప్రశాంతమైన జిల్లాలో కూడా రౌడీయిజం చేస్తున్నారు. తమ ఇంట్లో తాము ఉండటానికి కూడా పోరాటం చేస్తున్నారు. క్రింది స్థాయిలోని పోలీసులకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
 
ఐపీఎస్‌లు కూడా ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నారు. న్యాయం అడిగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అటువంటి పోలీసులు ఉన్నా ఒకటే లేక పోయినా ఒకటే అని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంకె బిందెలు గుర్తున్నాయా? ఇంటి కోసం తవ్వితే బంగారు పెట్టె దొరికింది..