Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితుడి భార్యతో అక్రమ లింకు.. అడ్డుగా ఉందనీ భార్య హత్య

Advertiesment
Chennai
తిరుపతిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న అక్కసుతో కట్టుకున్న భార్యనే హత్య చేశాడు కిరాతక భర్త. ఈ దారుణం తిరుపతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైకి చెందిన మురుగన్-సింధియా (40)లు భార్యాభర్తలు. 20 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఈ క్రమంలో మురుగన్‌కు అతని స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయం తెలిసిన భార్య మురుగన్‌ను నిలదీసింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న మురుగన్ ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఇందులో భాగంగా గత నెల 23వ తేదీన భార్యతో కలిసి తిరుపతి చేరుకున్నాడు. నగరంలోని పీకే లేఅవుట్‌లోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోతుండగా బెల్టుతో భార్య మెడ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం లాడ్జి నుంచి పరారయ్యాడు.
 
ఉదయం గదిలో చనిపోయిన మహిళను చూసిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మురుగన్ కనిపించకపోవడంతో అతడే ఈ హత్య చేసి ఉంటాడని భావించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖజానాను బాబు వ్యాక్యూమ్ క్లీనర్‌తో ఊడ్చేశాడు... కానీ: మంత్రి రమణ