Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. తేదీలు ఖరారు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (08:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో సెప్టెంబరు 1, 2 తేదీల్లో పర్యటించనున్నారు. సెప్టెంబరు 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం ఇడుపులపాయ వెళ్లనున్నారు. 
 
ఇందుకోసం ఆయన సెప్టెంబరు 1న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆరోజు రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్లో సీఎం జగన్ బస చేస్తారు. సెప్టెంబరు 2న ఉదయం వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించి తిరుగు ప్రయాణం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఇదిలావుండగా, ప్రస్తుతం సీఎం జగన్ ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. ఈనెల 28న ముఖ్యమంత్రి జగన్ వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తయ్యాయి. సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ఈనెల 26 నుంచి వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి..రేపు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments