Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో థియేటర్ల మూసివేత పరంపర.. చిత్తూరులో 37 జిల్లాలో క్లోజ్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపరంపర కొనసాగుతోంది. థియేటర్లలో సౌకర్యాల లేమి పేరుతో వీటిని స్థానిక తనిఖీలు నిర్వహిస్తూ థియేటర్లను మూసివేస్తున్నారు. తాజాగా చిత్తూరులో 37 థియేటర్లను మూసివేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందులో జిల్లాలోని మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోటలో 3, బి కోటలో 2, పీలేరులో 4, పుంగనూరులో 4, రొంపిచర్లలో 2, కలికిరిలో 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబళ్ళపల్లిలలో ఒక్కో థియేటర్ చొప్పున అధికారులు మూసివేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి 37 థియేటర్లు మూతపడ్డాయి. 
 
దీనిపై మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ, థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించడం, లైన్సెన్స్‌లు పునరుద్ధించకపోవడం తదితర కారణాల కారణంగా థియేటర్లను మూసివేసినట్టు చెప్పారు. ఇప్పటికు జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 థియేటర్లను మూసివేసినట్టు తెలిపారు. సౌకర్యాల లేమిపై ప్రేక్షకులు సైతం తమకు ఫిర్యాదులు చేయొచ్చని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments