Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో థియేటర్ల మూసివేత పరంపర.. చిత్తూరులో 37 జిల్లాలో క్లోజ్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపరంపర కొనసాగుతోంది. థియేటర్లలో సౌకర్యాల లేమి పేరుతో వీటిని స్థానిక తనిఖీలు నిర్వహిస్తూ థియేటర్లను మూసివేస్తున్నారు. తాజాగా చిత్తూరులో 37 థియేటర్లను మూసివేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందులో జిల్లాలోని మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోటలో 3, బి కోటలో 2, పీలేరులో 4, పుంగనూరులో 4, రొంపిచర్లలో 2, కలికిరిలో 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబళ్ళపల్లిలలో ఒక్కో థియేటర్ చొప్పున అధికారులు మూసివేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి 37 థియేటర్లు మూతపడ్డాయి. 
 
దీనిపై మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ, థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించడం, లైన్సెన్స్‌లు పునరుద్ధించకపోవడం తదితర కారణాల కారణంగా థియేటర్లను మూసివేసినట్టు చెప్పారు. ఇప్పటికు జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 థియేటర్లను మూసివేసినట్టు తెలిపారు. సౌకర్యాల లేమిపై ప్రేక్షకులు సైతం తమకు ఫిర్యాదులు చేయొచ్చని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments