Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్‌ను కొట్టి చంపిన తల్లి, బంధువులు?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:37 IST)
తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ హత్యకు గురైంది. తల్లి, బంధువులు కలిసి ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన ఒక యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం నగరానికి చెందిన ఉమాదేవి జులైలో తన కుమారుడు నవీన్ కుమార్ కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కొన్ని రోజుల తరువాత పోలీసులు అతన్ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టులో నవీన్ కుమార్.. తాను ఒక మహిళగా మారిపోయానని.. దీంతో ఇంట్లో తల్లి, బంధువుల గొడవ చేస్తుండడంతో పారిపోయి విడిగా ఉంటున్నానని చెప్పాడు. అందుకు కోర్టు..  అతను ఒక మహిళగా జీవించేందుకు అధికారం ఉందంటూ తీర్పునిచ్చింది. 
 
ఈ నెల 13న తల్లిని చూడడానికి నవీన్ కుమార్‌ ఇంటికి రాగా అతను ఇంటి పరువు తీస్తున్నాడంటూ తల్లి, బంధువులు చితకబాదారు. అతడికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్ వేయాలని కూడా ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో అతను ప్రతిఘటించేసరికి తల్లి ఉమాదేవి అతడిని బలంగా కొట్టింది. దాంతో నవీన్ కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ నెల 14న మృతిచెందాడు. పోలీసులు నవీన్ మరణించక ముందు అతడి వాంగ్మూలం తీసుకున్నారు. మృతుడి తల్లి, బంధువులపై హత్య కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments