Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్‌ను కొట్టి చంపిన తల్లి, బంధువులు?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:37 IST)
తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ హత్యకు గురైంది. తల్లి, బంధువులు కలిసి ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన ఒక యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం నగరానికి చెందిన ఉమాదేవి జులైలో తన కుమారుడు నవీన్ కుమార్ కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కొన్ని రోజుల తరువాత పోలీసులు అతన్ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టులో నవీన్ కుమార్.. తాను ఒక మహిళగా మారిపోయానని.. దీంతో ఇంట్లో తల్లి, బంధువుల గొడవ చేస్తుండడంతో పారిపోయి విడిగా ఉంటున్నానని చెప్పాడు. అందుకు కోర్టు..  అతను ఒక మహిళగా జీవించేందుకు అధికారం ఉందంటూ తీర్పునిచ్చింది. 
 
ఈ నెల 13న తల్లిని చూడడానికి నవీన్ కుమార్‌ ఇంటికి రాగా అతను ఇంటి పరువు తీస్తున్నాడంటూ తల్లి, బంధువులు చితకబాదారు. అతడికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్ వేయాలని కూడా ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో అతను ప్రతిఘటించేసరికి తల్లి ఉమాదేవి అతడిని బలంగా కొట్టింది. దాంతో నవీన్ కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ నెల 14న మృతిచెందాడు. పోలీసులు నవీన్ మరణించక ముందు అతడి వాంగ్మూలం తీసుకున్నారు. మృతుడి తల్లి, బంధువులపై హత్య కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments