Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో మళ్లీ వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..?

చిత్తూరు జిల్లాలో మళ్లీ వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..?
, బుధవారం, 15 డిశెంబరు 2021 (20:15 IST)
చిత్తూరు జిల్లాలో గతంలో వింత శబ్ధాలు మొదలయ్యాయి. తాజాగా చిత్తూరులో వింత శబ్ధాలు మొదలైనాయి. ఆ శబ్ధం ఎక్కడా అని తెలిస్తే షాకవ్వక తప్పదు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాకాల మండలం బండకాడపల్లిలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. బండకాడపల్లిలో నివాసం ఉంటున్న మురళి నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎప్పుడూ లేని విధంగా వింతైన శబ్దాలు రావడం మొదలైంది.  
 
అయితే చుట్టు పక్కల నుంచి ఏదో జంతువులు శబ్దాలు చేస్తున్నాయనుకుని.. నిద్రలోకి జారుకున్నాడు. కానీ రాను రాను ఆ శబ్దాలు ఎక్కువ కావడం మొదలయ్యాయి. ఎంతసేపటికి ఆ శబ్దాలు ఆగకుండా వస్తుండడంతో ఇంటిలోని వారిని కూడా నిద్ర లేపాడు. దీంతో ఇంటికి చుట్టుపక్కల ప్రదేశాలను గాలించడం మొదలుపెట్టారు. కానీ ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించలేక పోయారు. మళ్లీ ఇంట్లోకి వచ్చి నిద్రలోకి జారుకున్నారు.
 
మళ్ళీ శబ్దాలు వినిపించడం మెుదలైంది. గమనించిన మురళి ఇంటిలో వేసిన వరి ధాన్యం మూటలను మధ్య అన్వేషణ కొనసాగించాడు. ఇంతలో మూటల మధ్యలో అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన మురళి చుట్టు పక్కల వారిని పిలిపించి విగ్రహాన్ని బయటకు తీశాడు. వెంటనే అమ్మవారికి చుట్టుపక్కల వారు పూజలు చేయడం మొదలెట్టారు.
 
అర్ధరాత్రి అమ్మవారు ప్రత్యక్షం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక అడుగు ఎత్తు రెండు కిలోల బరువు ఉన్న అమ్మవారి పంచలోహ విగ్రహానికి గ్రామంలో గుడి నిర్మించేందుకు ప్రభుత్వం, ప్రజల సహకారం కావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, వైఎస్ ఆర్ క్రిస్టియన్ పార్టీ.. స్వామీజీ సంచలన వ్యాఖ్యలు