గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 12 రైళ్లు తాత్కాలికంగా రద్దు

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:58 IST)
విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. 12 రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే మార్గాల్లో దారి మళ్లించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదిలావుంటే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగితా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించాల్సిన ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, కాచిగూడ - నడికుడి, నడికుడి - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, గుంటూరు - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - రేపల్లే రైళ్లు రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments