Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. 12 రైళ్లు తాత్కాలికంగా రద్దు

godavari express
Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:58 IST)
విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. 12 రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే మార్గాల్లో దారి మళ్లించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదిలావుంటే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగితా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించాల్సిన ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, కాచిగూడ - నడికుడి, నడికుడి - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, గుంటూరు - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - రేపల్లే రైళ్లు రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments